హైదరాబాద్: మైనార్టీ గురుకులాల్లో 2021–22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈనెల 31 వరకు అప్లికేషన్ గడువును పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీఎంఆర్ఐఎస్ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏవైనా సందేహాలుంటే 040–23437909 హెల్ప్లైన్ నంబర్కు ఫోన్చేయాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి