భూత్పూర్, మే 20 : మున్సిపాలిటీలోని 1వ వార్డు (రాందాస్తండా)లో క రోనా బాధితుల కోసం కౌన్సిలర్ ముడావత్ బాలకోటి సొంత ఖర్చుతో ఐసొలేష న్ కేంద్రం ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ నిర్ధారణ అయింది. వారి ఇండ్లు చిన్నగా ఉండడంతో వారిని ఎక్కడ ఉంచాలన్న దానిపై తండాలో చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలో వారిని తండాలోని ప్రాథమి క పాఠశాలలో ఉంచుదామని నిర్ణయం తీసుకున్నారు. అయితే స్కూల్లో లైట్లు, ఫ్యాన్లు లేవని కొందరు చెప్పడంతో కౌన్సిలర్ బాలకోటి స్పందించి లైట్లు, ఫ్యాన్లు తాను ఏర్పా టు చేయిస్తానని, అవసరమైతే రెండు ఆక్సిజన్ సిలిండర్లను సొంత డబ్బులతో ఇప్పిస్తానని చెప్పారు. వెం టనే విద్యుత్ వైర్లను తెచ్చి ఫ్యాన్లు, లైట్లను బిగించా రు. కరోనాతో బాధితులకు అండగా నిలిచిన కౌన్సిలర్కు తండావాసులతోపాటు, టీఆర్ఎస్ నాయకు లు రమేశ్, రవి, లక్ష్మణ్, దేవేందర్ తదితరులు అభినందలు తెలిపారు.