న్యూఢిల్లీ: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 28 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 41
ఇందులో జనరల్ 18, బీసీ 4, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: బీటెక్ లేదా బీఈలో సీవిల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. గేట్ 2021లో వ్యాలిడ్ స్కోర్ సాధించాలి. అభ్యర్థులు 30 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్-2021 స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 28
వెబ్సైట్: nhai.gov.in