మార్కెట్లో దీపావళి సందడి

ఊపందుకున్న బంతిపూలు, గుమ్మడికాయల విక్రయాలు
సిద్దిపేట టౌన్ /మెదక్టౌన్ : చీకట్లను పారద్రోలి అందరి జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి సందడి మొదలైంది. ఈ ఏడాది దీపావళి పండుగ ఒకే రోజు వస్తుండటంతో సందడి కాస్త రెట్టింపు అయ్యింది. ఇది వరకు దీపావళి రెండు రోజుల పాటు నిర్వహించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉదయం హారతులు, సాయంత్రం లక్ష్మీపూజలు ఉండటంతో పండుగ సామగ్రి కొనుగోలు చేస్తూ జిల్లాలో పండుగ వాతావరణం మొదలైంది. మహిళలు పండుగకు కావాల్సిన పూలు, సెమియా కొనుగోలు చేస్తూ కనిపించారు. వ్యాపారులు గుమ్మడికాయలు, దేవతామూర్తుల చిత్రపటాలు, మామిడి ఆకులు, పూలదండలు కొనుగోలు చేస్తూ కనిపించారు. మిఠాయి దుకాణాల వద్ద సందడి నెలకొన్నది.
వివిధ ఆకృతుల్లో ప్రమిదలు
దీపావళి పండుగ అనగానే ఇండ్ల ముందు దీపాలను వెలిగించే ఆనవాయితీ అనాధిగా వస్తోంది. అందులో భాగంగానే వివిధ ఆకృతుల్లో దీపాలను వెలిగించేందుకు ఉత్సాహాన్ని కనబరుస్తారు. అందుకనుగుణంగానే విక్రయదారులు మహారాష్ట్ర, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి విభిన్న ఆకృతులు కలిగిన ప్రమి దలను తీసుకవచ్చి విక్రయిస్తున్నారు. మహిళలు ప్రమిదలను కొనుగోలు చేస్తూ కనిపించారు.
తాజావార్తలు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురితో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్నాథ్సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి