Siddipet
- Nov 13, 2020 , 01:55:22
VIDEOS
ధరణి పోర్టల్తో పారదర్శకంగా భూ రిజిస్ట్రేషన్లు

జగదేవ్పూర్: ధరణి పోర్టల్తో రైతుల భూ రిజిస్ట్రేషన్లు వేగం గా, పారదర్శకంగా జరుగుతున్నాయని గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి అన్నారు. గురువారం జగదేవ్పూర్ మండల తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఆయన, అధికారులకు సూచనలు చేశారు. అలాగే, రైతులకు పాసుపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో భూముల రిజిస్ట్రేషన్లు జరిగి పట్టా అమలు కావాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. ప్రభుత్వం తెచ్చిన ధరణితో రిజిస్ట్రేషన్ అర గంటలో పూర్తవుతున్నాయన్నారు. రైతులు తమ భూముల క్రయవిక్రయాలు జరిపినప్పుడు మీ సేవ ద్వారా గానీ, మొబైల్ ద్వారా గానీ స్లాట్ బుక్ చేసుకోవా లన్నారు. బుక్ చేసుకున్న మరుసటి రోజూ కార్యాలయానికి వెళ్తే, అరగంటలో పట్టా, పాసుబుక్ చేతికి ఇస్తున్నారన్నారు.
తాజావార్తలు
- రేడియోలాజికల్ ఫిజిక్స్లో ఎమ్మెస్సీ డిప్లొమా
- ఎంపీ కొడుకుపై కాల్పులు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి
- కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలి
MOST READ
TRENDING