జడ్చర్లటౌన్, మే10: రాష్ట్రంలోని అన్ని మతాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ పండుగలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకలు అందజేస్తున్నారు. రంజాన్ కిట్లను తీసుకున్న పేదలు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సోమవారం రంజాన్ కిట్లు పంపిణీ కార్యక్రమం మొదలయ్యింది. హౌసింగ్బోర్డు కాలనీలో చైర్పర్సన్ దోరెపల్లి లక్ష్మీ చేతుల మీదుగా రంజాన్ కిట్లను అందించారు. పాతబజార్లోని అలీమసీదులో 13వ,23వ వార్డుల కౌన్సిలర్లు నందకిషోర్గౌడ్, ఉమాశంకర్గౌడ్ రంజాన్ కిట్ల పంపిణీని ప్రారంభించారు. 2వ వార్డులో మహేశ్, 3వ వార్డు కౌన్సిలర్ సతీశ్, 4వ వార్డులో దేవా, 9వ వార్డులో చైతన్య, 25వ వార్డులో లత, 26వ వార్డులో కౌన్సిలర్ ఆలూరి శశికిరణ్ మసీదుల వద్ద రంజాన్ కిట్ల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ రంజాన్ పండుగ జరుపుకోవాలని సూచనలు చేశారు.