మంచిర్యాల : సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలాంటివని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం, క్యాతనపల్లి, మందమర్రితో పాటు పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పలు చోట్ల ఆరోగ్య ఉపకేంద్రాలకు భూమి పూజ చేశారు.
ఆయిల్ పామ్ తోటలను పరిశీలించారు. జైపూర్ మండలకేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పలు మండలాల్లో వడ్ల కల్లాల వద్ద రైతులతో మాట్లాడారు.
ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం రైతులకు అండగా ఉన్నదని గుర్తుచేశారు. పంట పెట్టుబడి సాయం, బీమా, నిరంతరం నాణ్యమైన కరెంటు, నీటి సరఫరా అందజేస్తూ రైతు పక్షపాతిగా ఉన్నారని గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి..
వైద్య రంగం మరింత బలోపేతం : ఎమ్మెల్సీ కవిత
సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి