అంబర్పేట, మే 7: బాగ్అంబర్పేట డివిజన్ ఇంద్రప్రస్థ కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన పార్కును సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పార్కు అభివృద్ధిలో భాగంగా వృద్ధులు, మహిళలు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయాలని, వాకింగ్ ట్రాక్ నెలకొల్పాలని, టైల్స్, పెయింటింగ్ వేయించాలని చెప్పారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. పార్కు సుందరీకరణలో భాగంగా వివిధ రకాల మొక్కలను నాటడం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, గేటును బిగించడం వంటి వాటిని కూడా చేపడతానన్నారు. అనంతరం పార్కులోని కమ్యూనిటీహాల్లో ఉన్న లైబ్రరీని సందర్శించి అక్కడ కావాల్సిన బెంచీలు, బుక్స్ పెట్టుకోవడానికి అవసరమైన రాక్స్ విషయమై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ప్రీతి, హేమకాంత్, రోషన్, ఓం, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
గోల్నాక, మే 7:ముస్లింలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం అంబర్పేట డివిజన్లోని సీపీఎల్ మసీదు వద్ద రంజాన్ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన రంజాన్ కానుకలను పంపిణీ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్తో కలసి రంజాన్ కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సమాన ప్రధాన్యతనిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు .ఈ కార్యక్రమంలో మసీదు నిర్వాహకులు ఖలీల్, అమర్బిన్ ఉస్మాన్, కలీం, సమీదుల్లా, సాజిద్, టీఆర్ఎస్ నాయకులు సతీశ్, సిద్ధార్థ్ముదిరాజ్, సతీశ్గౌడ్, సలీం, ప్రవీణ్ పటేల్, మహేశ్ శ్రీను, రంగు ఉదయ్, నరేందర్, పాల్గొన్నారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం అంబర్పేట డివిజన్ పటేల్నగర్, ప్రేమ్నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన జీహెచ్ఎంసీ సిబ్బందితో ఇంటింటికీ శానిటైజేషన్ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. . ప్రజలు విధిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావొద్దని ఎమ్మెల్యేకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సిద్ధార్థ్ముదిరాజ్, సతీశ్, కాలేరు భరత్, సమీదుల్లా, మోహిన్, బోస్, చింటు తదితరులు పాల్గొన్నారు.