ఐజ్వాల్: దేశమంతా కరోనా మహమ్మారి వీర విహారం చేస్తుంటే ఈశాన్య రాష్ట్రం మిజోరంను మరో కొత్త వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) అనే కొత్త వ్యాధితో మిజోరంలో నిత్యం పదుల సంఖ్యలో పందులు మృత్యువాత పడుతున్నాయి. గత మార్చి 21న తొలి మరణం నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం 1728 పందులు మృతిచెందాయి. ఈ వ్యాధి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాకుతూ రాష్ట్రమంతటా చుట్టుకుంటున్నది.
మిజోరంలో గత నెల రోజులకుపైగా తిష్టవేసిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా పందుల మరణాల రూపంలో రూ.6.91 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రధానంగా ఐదు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉన్నదన్నారు. ఐజ్వాల్, లంగ్లేయ్, సెర్చిప్, లౌంగ్ట్లాల్, మామిత్ జిల్లాల్లో వ్యాధి విస్తరణ ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్.. కరోనా సాయం ఫైలుపై తొలి సంతకం
పావురం కాలికి చిప్.. గూఢచర్యమేనా..!
వరుసగా రెండో రోజూ 4 లక్షలు దాటిన కరోనా కేసులు
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్
పురివిప్పిన మయూరం.. కనువిందు చేసిన నాట్యం.. వీడియో
వర్షాలు కురువాలని కప్పలకు పెండ్లి..వీడియో
తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు