గత ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు- హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు అనే చిత్రం రూపొందగా, ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అంతే కాదు మహేష్ కెరియర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగాను నిలిచింది. ఈ క్రమంలో మహేష్- అనీల్ రావిపూడి కాంబినేషన్లో మరో మూవీ ఉంటుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తుంది. అనీల్ కూడా ఓ ఇంటర్వ్యూలో మహేష్తో మూవీ ఉండొచ్చని అన్నాడు.
సర్కారు వారి పాట చిత్రం తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలోనే మహేష్ సినిమా చేస్తాడని అందరు అనుకున్నారు. కాని సడెన్గా త్రివిక్రమ్ ఫ్రేమ్లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి, వంశీ పైడిపల్లి వంటి దర్శకులు మహేష్ తో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనీల్ రావిపూడితో సినిమా ఇప్పట్లో ఉండదనే అనుమానాలు అభిమానులలో మొదలయ్యాయి. కాగా, అనీల్ త్వరలో బాలకృష్ణతో మల్టీ స్టారర్ చేయనున్నట్టు టాక్.