ఢిల్లీ ,మే 2:కరోనా కారణంగా ఆన్లైన్ ఆఫ్ లైన్ ను బదులు ఆన్ లైన్ మీటింగ్ లకే కాకుండా ఇంటర్వ్యూలు, తరగతుల వరకు అంతా ఆన్లైన్లోనే మారిపోయింది. ఒకటో తరగతి చదివే విద్యార్థుల నుంచి పీజీ చేసే స్టూడెంట్స్ వరకూ జూమ్ కాల్లో క్లాసులు వినాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే జూమ్ వీడియో కాల్స్ చేసే సమయంలో బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండక కొందరు ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. అలా కాకుండా మీరు వీడియో కాల్లో మాట్లాడుతున్న సమయంలో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ను సెట్ చేసుకునే అవకాశం ఉంటే భలే ఉంటుందనిపిస్తుంది.
జూమ్ డెవలపర్స్ అందుకోసమే సరికొత్త ఫీచర్ ను అందిస్తున్నది. “ఇమ్మర్సివ్ వ్యూ ” పేరుతో ఓ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీని సహాయంతో మీ బ్యాక్గ్రౌండ్ను మీకు నచ్చినట్లు సెట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థులు తరగతి గదిలో కూర్చున్నట్లు, ఉద్యోగులైతే ఆఫీసుల్లో ఉన్నట్లు సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ను ఇతర దేశాల్లో ఉన్న జూమ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా నచ్చిన బ్యాక్గ్రౌండ్ను సెట్ చేసుకునే అవకాశం ఉన్నా.. దాన్ని కేవలం సమావేశాన్ని ఏర్పాటు చేసే హోస్ట్కు మాత్రమే అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఈ ఫీచర్ను డెస్క్టాప్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మొబైల్లోనూ ఈ ఫీచర్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం విదేశాల్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ను భారత్లోనూ తీసుకురానున్నట్లు జూమ్ పేర్కొన్నది.