టీవీలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొవిడ్ మరణాల చర్చలే. దీంతో చాలామంది బెంబేలెత్తిపోతున్నారు. నిజానికి కొవిడ్ నుంచి రోజూ ఎంతోమంది కోలుకుంటున్నారు. అందుకు ఉదాహరణ ఈ బామ్మ. వడోదరాకు చెందిన కుసుమ్ సోనీ అనే 102 ఏండ్ల వృద్ధురాలు కరోనా బారిన పడింది. అయితేనేం, ఆ వైరస్తో యుద్ధం చేసి కోలుకుంది. ‘నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా పనులు నేనే చేసుకుంటున్నాను’ అని సంతోషంగా చెప్పింది సోనీజీ. ‘తన ఆరోగ్యం గురించి ఇంట్లోవాళ్లు ఎంతో కంగారుపడ్డారనీ, కానీ కరోనా తనను ఏమీ చేయలేక పోయిందని’ చెప్పుకొచ్చింది. ప్రజలు వైరస్ గురించి భయపడొద్దని ధైర్యం నింపుతున్నది. ‘మా ఫ్యామిలీ డాక్టర్తో రెగ్యులర్గా టచ్లో ఉండేవాడ్ని. మొదటి పది రోజులు అమ్మ సరిగా తినక పోవడంతో చాలా భయమేసింది. కానీ, పదకొండో రోజునుంచీ పండ్లు, పండ్లరసాలు తీసుకోవడం మొదలుపెట్టింది. కేవలం ఇరవై రోజుల్లోనే అమ్మ పూర్తిగా కోలుకున్నది. ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉందని’ చెప్పాడు ఆమె తనయుడు ఉదయ్.