నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 27: జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్ష, వ్యాక్సినేషన్ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం బోధన్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ దవాఖానల్లో కరోనా పరీక్షలు నిర్వహించగా.. 61 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయా దవాఖానల వైద్యాధికారులు వెల్లడించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీలో 40 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. నందిపేట్ పీహెచ్సీలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా.. 18 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి అజయ్ తెలిపారు. 310 మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. భీమ్గల్ పీహెచ్సీలో 39 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 19 పాజిటివ్ వచ్చినట్లు వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. మొత్తం 88మంది కరోనా టీకా తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మోర్తాడ్ సీహెచ్సీలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ సుమంత్ తెలిపారు. కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి పీహెచ్సీలో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చింది. 84 మందికి టీకా వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కమ్మర్పల్లి పీహెచ్సీలో 39 మందికి పరీక్షలు నిర్వహించగా.. 8 మందికి పాజిటివ్ వచ్చింది.143 మందికి టీకా వేశారు. రెంజల్ పీహెచ్సీలో 40మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. తాడ్బిలోలి లో ఈనెల 26 నుంచి మే 10 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతుందని సర్పంచ్ వెల్మల సునీత తెలిపారు. కందకుర్తి గ్రామం ఇందిరమ్మ కాలనీలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించినట్లు సర్పంచ్ ఖలీంబేగ్ తెలిపారు.
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వర్ని కమ్యూనిటీ వైద్యశాలలో 41 మందికి పరీక్షలు నిర్వహించగా, 11 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి వెంకన్న తెలిపారు. 92 మందికి టీకా వేశామని చెప్పారు. కోటగిరి మండలంలో 16 కరోనా కేసులు నమోదైనట్లు డాక్టర్ సమత తెలిపారు. ధర్పల్లి మండలంలో 66 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా, 27 మందికి పాజిటివ్ వచ్చిందని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రఘువీర్గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయగా, ప్రజలు వైద్య పరీక్షల కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. శిబిరం వద్ద రద్దీ పెరిగి తోపులాట జరుగడంతో ఇన్చార్జి ఎస్సై నరేశ్ అక్కడికి చేరుకొని క్యూలో నిల్చునేలా గ్రామస్తులను సముదాయించారు.
ప్రభుత్వ దవాఖానలో 172 మందికి వ్యాక్సిన్ వేశామని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ దవాఖానలో 163 మందికి కరోనా టీకాలు వేశామని మెడికల్ ఆఫీసర్ బాబురావు తెలిపారు. ఘన్పూర్ ఉన్నత పాఠశాలలో 35 మందికి కొవిడ్ టెస్టులు చేయగా, ఇద్దరికి పాజిటివ్గా తేలిందని చెప్పారు. జక్రాన్పల్లి పీహెచ్సీలో 49 మందికి టెస్టు లు చేయగా, పది మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి రవీందర్ తెలిపారు. 95 మందికి కొవిడ్ టీకాలు వేశామన్నారు.మోస్రా పీహెచ్సీలో 113 మందికి టెస్టులు నిర్వహించగా, 12 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారిణి స్వప్న తెలిపారు.ఆర్మూర్ ఏరియా దవాఖాన, హౌసింగ్ బోర్డులోని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించగా.. 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ నాగరాజు, ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారిణి అయేషా ఫిర్దోస్, హెల్త్ సూపర్వైజర్లు అనురాధ, చంద్రశేఖర్ తెలిపారు.
రోజుకు 40 మందికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు
రోజుకు 40 మందికి మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని మాక్లూర్, కల్లెడి దవాఖానల వైద్యులు సంజీవ్రెడ్డి, సిఖిందర్నాయక్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మండలంలోని మాక్లూర్, కల్లడి సీహెచ్సీల్లో మంగళవారం 143 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 21మందికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యుడు సంజీవ్రెడ్డి తెలిపారు.
గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
చందూర్,బాల్కొండ, ముప్కాల్ మండలంలోని నల్లూర్, మోపాల్ మండలంలోని కులాస్పూర్ గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించినట్లు ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు.
లొంక రామలింగ్వేరస్వామి ఆలయం ముసివేత
సిరికొండ, ఏప్రిల్ 27: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మండలంలోని శ్రీ లొంక రామలింగేశ్వరసామి ఆలయాన్ని రెండు వారాలపాటు మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు సహకరించాలని ఈ సందర్భగా వారు కోరారు.