ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 66,191 కరోనా కేసులు, 832 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,95,027కు, మొత్తం మరణాల సంఖ్య 64,760కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 61,450 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 35,30,060కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,98,354 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతున్నది.