ప్రతి ఓటరును పరీక్షించాకే ఓటేసేందుకు అనుమతించాలి
మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు శ్రీధర్
జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 23 : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి ఓటరును పరీక్షించాకే ఓటేసేందుకు అనుమతించాలని మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు శ్రీధర్ ఆదేశించారు. శుక్రవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంతకుముందు కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల, సెయింట్ ఆగ్నేస్ పాఠశాల, ఇందిరానగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తాగునీటి వసతి, టెంట్లు, అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఓటరూ తప్పనిసరిగా మాస్కు ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద, బ్యాలెట్ బాక్సుల తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యాలెట్బాక్సుల తరలింపునకు బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆర్టీపీసీఆర్ నిర్వహించాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ప్రత్యేకంగా ఓటేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
కలెక్టర్, ఎస్పీతో సమావేశం
ఎన్నికల పరిశీలనకు వచ్చిన రాష్ట్ర పరిశీలకులు శ్రీధర్ స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి సంబంధించిన రెండో విడుత ర్యాన్డమైజేషన్ను పూర్తి చేశారు. అలాగే ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఆర్డీవో పద్మశ్రీ, జడ్చర్ల మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
చెట్టంత దేవుడికి చెట్టు తొర్రే ఆలయం.. మన తెలంగాణలోనే
ఏపీలో రేపట్నుంచి నైట్ కర్ఫ్యూ.. వ్యాక్సిన్ ఫ్రీ
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి