మోహన్ లాల్- మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం దృశ్యం 2. కరోనా వలన ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించడమే కాకుండా అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి రీమేక్గా తెలుగులోను దృశ్యం 2 చిత్రం రూపొందుతుంది. వెంకటేష్- మీనా ప్రధాన పాత్రలలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 2 కేవలం 47 రోజులలోనే షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. జూన్లో చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించడంతో కరోనా వలన రిలీజ్పై అనిశ్చితి ఏర్పడింది.
కొద్ది రోజులుగా దృశ్యం 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం నిర్మాత సురేష్ బాబుకు చేరడంతో క్లారిటీ ఇచ్చారు. దృశ్యం 2 చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకోవడం లేదని, థియేటర్స్ పూర్తి స్థాయిలో విడుదలయ్యాకే రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు. కాగా, కరోనా వలన ఇష్క్, లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం సినిమాలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.