న్యూఢిల్లీ: నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ (ఎన్ఏఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. వచ్చేనెల 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 43 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 43
ఇందులో టెక్నికల్ అసిస్టెంట్- 19, టెక్నికల్ ఆఫీసర్ 1, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 6, టెక్నీషియన్ 17, ఫిట్టర్ 6, మెషినిస్ట్ 3, డ్రాట్స్మెన్ 2, టర్నర్, ఎలక్ట్రిషన్, పెయింటర్, ఎలక్ట్రోప్లాటర్, షీట్ మెటల్ వర్కర్ ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు మెకానికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ఇంజినీరింగ్లో 55 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం తప్పనిసరి. మిగిలిన పోస్టులకు మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ మెటల్లర్జీలో డిప్లొమా లేదా బీఎస్సీ కంప్యూటర్స్లో ఏదోఒకటి చేసి ఉండాలి. అదేవిదంగా పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. వయస్సు ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 21
వెబ్సైట్: nal.res.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..