స్టేషన్ఘన్పూర్టౌన్, ఏప్రిల్ 20: దళారుల నుంచి రైతులను కాపాడి పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం కేసీఆర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేస్తున్నారని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య చెప్పారు. మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో మంగళవారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాజయ్య మాట్లాడుతూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. స్టేషన్ఘన్పూర్ నియోజక వర్గంలోని ఐదు మండలాల పరిధిలో 62 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ద్వారా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్డీఏ పీడీ రాంరెడ్డి, ఎంపీడీవో కుమారస్వామి, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సురేశ్కుమార్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎస్ దయాకర్, ఎంపీటీసీ మునిగెల రాజు, ఉప సర్పంచ్ నీల ఐలయ్య, నాయకులు గోనెల ఉప్పలయ్య, సింగపురం రమేశ్కుమార్ పాల్గొన్నారు.
జఫర్గఢ్లో..
జఫర్గఢ్ : మండలంలోని జఫర్గడ్, కూనూరు గ్రామా ల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పీఏసీఎస్ డైరెక్టర్లు పట్టపూరి సదయ్యగౌడ్, మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యానికి మద్దతు ధర పొందేందుకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. కూనూరులో కొనుగోలు కేంద్రాన్ని మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూనూరు సర్పంచ్ ఇల్లందుల కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భిక్షపతి, పీఏసీఎస్ సీఈవో అంగడి భాస్కర్ పాల్గొన్నారు.
పాలకుర్తిలో..
పాలకుర్తి రూరల్ : రైతును రాజును చేయడమే తెలంగాణ సర్కారు ధ్యేయమని డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాఘవపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీ ఫ్లోర్లీడర్ పుస్కూరి శ్రీనివాస్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ రైతులు మధ్య దళారులకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ము స్కు రాంబాబు, సర్పంచ్ సోమ శ్రీనివాస్, ఏపీడీ కొండల్రెడ్డి, ఏపీఎం రమణాచారి, నల్ల వసంత, ముస్కు కొమురెల్లి, సీసీ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి చుక్క లింగయ్య, రాగం ప్రతాప్, రాజమ్మ, సైదమ్మ పాల్గొన్నారు.