న్యూఢిల్లీ : దదేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం పలు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. కేసుల పెరుగుదలతో రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికలతో మహమ్మారి కట్టడికి దవాఖానలు, పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు వంటి మౌలిక వసతులను భారీగా మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఈ భేటీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో కేంద్ర మంత్రి మాట్లాడారు. వైరస్ తీవ్రతతో సతమతమవుతున్న రాష్ట్రానికి నిరంతర ఆక్సిజన్ సరఫరాలతో పాటు అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మహారాష్ట్రకు అదనంగా 1121 వెంటిలేటర్లను పంపుతున్నామని వెల్లడించారు.