న్యూఢిల్లీ: గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తనకు లభించిన గోల్డెన్ చాన్స్ను మిస్ చేసుకోవద్దని.. ఆ సంస్థకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. త్వరితగతిన భారతదేశంలో మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించాలని హితవు చెప్పారు.
ఈ విషయమై టెస్లా సంస్థ ప్రతినిధులతో గత వారం చర్చించారని తెలుస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో భారత మాన్యుఫాక్చరర్స్ శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయొద్దని టెస్లా ప్రతినిధులను ఆయన హెచ్చరించారని సమాచారం. వెబ్ ఆధారితంగా జరిగిన చర్చాగోష్టిలో నితిన్ గడ్కరీ, టెస్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై, బెంగళూరు నగరాల్లో కార్ల విక్రయానికి టెస్లా ప్రణాళికలు రూపొందించుకున్నదని నితిన్ గడ్కరీ తెలిపారు.
భారత కార్ల కొనుగోలు దారులకు దయ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు టెస్లా రూపొందించుకున్న ప్రణాళికను స్వాగతించారు.
అదే సమయంలో విద్యుత్ కార్లు, ఇతర వాహనాల తయారీలో భారత కార్ల తయారీ దారులు చాలా పురోగతి సాధించారని టెస్లా ప్రతినిధుల ద్రుష్టికి గడ్కరీ తెచ్చారని సమాచారం.
త్వరలో భారత కార్ల తయారీ సంస్థలు మున్ముందు టెస్లాకు గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం సంపాదించుకుంటాయన్నట్లు తెలిసింది.
మరో రెండు, మూడు నెలల్లో టెస్లా మోడల్-3 కారును భారత విపణిలోకి ప్రవేశ పెట్టేందుకు టెస్లా సీఈవో ఎలన్మస్క్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కర్ణాటకలో తన సంస్థ పేరును నమోదు చేశారు.
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!