మేడ్చల్ మల్కాజిగిరి : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఫతేనగర్ డివిజన్ పరిధి శివాలయం రోడ్డులో రూ. 19 లక్షల నిధులతో తాగునీటి పైప్లైన్ పనులకు డివిజన్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు నివారించడం కోసం కోట్లాధి నిదులు కేటాయించి రిజర్వాయర్లు నిర్మించినట్లు తెలిపారు. ఆయా రిజర్వాయర్ల ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు తాగునీటి వసతిని మెరుగుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. ఫతేనగర్ డివిజన్లో అన్ని ప్రాంతాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులను నివారించినట్లు చెప్పారు.
ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు నడుస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సుప్రజ, నాయకులు కె రాములు, కె భిక్షపతి, సతీశ్, సుధాకర్రెడ్డి, సత్యనారాయణ, కె రాము, కె కీర్తి, శంకర్గౌడ్, సురేంద్నాయుడు, రామకృష్ణతదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్రావు
రాజన్న ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతి రద్దు
ఐదేండ్ల తర్వాత హాఫ్సెంచరీ చేసిన స్టార్ ఆల్రౌండర్