శ్రీనగర్కాలనీ, ఏప్రిల్ 11: మెరుగైన వైద్యసేవలను అందించడంతోనే ప్రజాదరణ పొందుతారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు-3లో ఆదివారం సుధా ఫెర్టిలిటీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలందరూ జాగ్రత్తలు పాటించడంతోనే ఆరోగ్యాన్ని కాపాడుకునే వీలుందన్నారు. సుధా హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కందస్వామి మాట్లాడుతూ తమిళనాడుతో పాటు దేశంలోనే ఐవీఎఫ్లో మొదటి స్థానంలో ఉన్న సుధా ఫెర్టిలిటీ కేంద్రం నగరంలో ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక సదుపాయాలతో సంతాన సాఫల్య కేంద్రాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సంతానోత్పత్తి సేవలను అందించడంలో మూడున్నర దశాబ్దాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందామని గుర్తుచేశారు. దేశంలో ఆరు కేంద్రాలుగా సుధా ఫెర్టిలిటీ ఉందని, త్వరలోనే బెంగళూరు, ఢిల్లీ, ముంబయిలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, గోవర్ధన్రెడ్డి, ఎండీ కె.సుధాకర్, అధ్యక్షుడు డాక్టర్ ధనభాగ్యం, ఉపాధ్యక్షుడు ప్రదీప్ ఆనందన్ పాల్గొన్నారు.