న్యూఢిల్లీ: భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఈ ఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీ బుద్ధ విహార్ మార్కెట్ ప్రాంతంలో హరీశ్ అనే వ్యక్తి తన భార్య నీలును శనివారం మధ్యాహ్నం అందరూ చూస్తుండగా కత్తితో 25 సార్లు పొడిచాడు. ఆమెను కాపాడేందుకు దగ్గరకు రాబోయిన కొందరిని ఆ కత్తితో బెదిరించాడు. కొంతసేపటికి రక్తం మడుగుల్లో నీలు చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి భర్త హరీశ్ను అరెస్ట్ చేశారు. నిందితుడు ఒక మ్యారేజ్బ్యూరోలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు.