కేశంపేట ఏప్రిల్9: టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేం ద్రంలో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మ హి ళలకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. రాష్ట్రంలోని నిరుపేద యువతులకు చేయూతనిచ్చేందకు ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అదేవిధంగా నిరుపేద బాలికల చదువుల కోసం గురుకుల పాఠశా లలు, కళాశాలలు ప్రవేశపెట్టిందని, మహిళల భద్రత కోసం షీటీంలను ఏర్పాటు చేసిందన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై.రవీందర్యాదవ్, జడ్పీటీసీ తాండ్ర విశాల, మార్కెట్ వైస్చైర్మెన్ లక్ష్మీ నారాయణగౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ జగదీశ్వర్గౌడ్, వైస్ ఎంపీపీ అనురాధ, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, తాసీల్దార్ మురళీకృష్ణ, సర్పంచ్లు నవీన్కుమార్, జగన్నాయక్, మాజీ జడ్పీటీసీ పల్లె నర్సింగ్రావు, నాయకులు శ్రావణ్రెడ్డి, యాదగిరిరావు, శేఖర్పంతులు, మధుసూధన్గౌడ్, బాల్రాజ్గౌడ్, లక్ష్మీనారాయణ, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.