మనోహరాబాద్, ఏప్రిల్ 5 : కులవృత్తుల పరిరక్షణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరువ చూపుతున్నారని ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్ అన్నారు. సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయడంతో మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో నాయీ బ్రాహ్మణ సం ఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మల్లేశ్, జనరల్ సెక్రటరీ శ్రీశైలం, సభ్యులు నగేశ్, శ్రీనివాస్, రవి, రమేశ్, సురేశ్, బాబు, ప్రవీణ్, లక్ష్మణ్, శంకర్ ఉన్నారు.
కులవృత్తులకు జీవం పోస్తున్న సీఎం కేసీఆర్
లాండ్రీ, హెయిర్ కటింగ్ సెలూన్, దోభీఘాట్లకు 250యూనిట్ల ఉచిత నాణ్యమైన విద్యుత్ను అందించడంపై హర్షం వ్యక్తంచేస్తూ మండల కేంద్రంలోని మడలేశ్వర ఆలయం వద్ద సోమవారం రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగుస్వామి, గ్రామ రజకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగుస్వామి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నాడన్నారు. కులవృత్తులకు జీవం పోస్తున్న మహనీయుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు, గ్రామస్తులు లక్ష్మీనర్సింహులు, ఎల్లం, వార్డు సభ్యురాలు రాజవ్వ, గ్రామ రజక సంఘం సభ్యులు ఉన్నారు.
ఇవీ కూడా చదవండి…
జిల్లాకు అవార్డు రావడం హర్షణీయం