ఇండోర్: మధ్యప్రదేశ్లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకుపై పోలీసులు అత్యాచారం కేసు నమోదుచేశారు. ఎమ్మెల్యే కొడుకు పెండ్లి పేరుతో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని రాష్ట్రానికి చెందిన మహిళా యూత్ కాంగ్రెస్ నాయకురాలు ఆరోపించడంతో నిందితుడిపై పోలీసులు కేసు బుక్చేశారు. కాగా, సదరు మహిళ తన కుమారుడిపై తప్పుడు కేసు పెట్టిందని ఎమ్మెల్యే ఆరోపించారు.
గత కొంతకాలంగా సదరు మహిళ తన కొడుకును డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నదని, డబ్బులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు అత్యాచారం కేసు పెట్టిందని ఎమ్మెల్యే చెబుతున్నారు. తన కుమారుడు ఈ విషయాన్ని ముందే తనకు చెప్పాడని, ఈ మేరకు ఏప్రిల్ 1న ఇండోర్ డీఐజీకి కూడా ఫిర్యాదు చేశాడని చెప్పారు. ఇండోర్ డీఐజీని వివరణ కోరగా.. ఇరుపక్షాల ఫిర్యాదులపై దర్యాప్తు జరుగుతున్నదని తెలిపారు.
కాగా, మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రాంత్ భూరియా ఈ ఘటపై మాట్లాడుతూ ఓ విచారణ కమిటీ వేసినట్లు వెల్లడించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో ఇద్దరు మహిళా సభ్యులు, ఒక పురుష సభ్యుడు ఉన్నాడని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్కు రాష్ట్రపతి
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
కొవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
కరోనా విలయం.. 89వేలు దాటిన కేసులు