అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఆర్టీసీ బస్సులో శనివారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సులు నిలిపి, ప్రయాణికులను దింపి వేశాడు. వెంటనే సిబ్బంది స్పందించి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బస్సు బయలుదేరిన కొద్ది సేపటికే ఇంజిన్లో మంటలు చెలరేగాయి. కాకినాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సమయంలో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికీ ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.