కొవిడ్ నేపథ్యంలో ఆలయంలోనే రథోత్సవాలు
వేములవాడలో కొనసాగుతున్న శివ కల్యాణ మహోత్సవాలు
వేములవాడ టౌన్, ఏప్రిల్ 2: వేములవాడ రాజన్న ఆలయంలో శివకల్యాణ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నాలుగోరోజు శుక్రవారం ఉదయం 6గంటలకు ఆలయ స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలకు అభిషేకాలు, పారాయణాలు నిర్వహించారు. ఆచార్య దంపతులు గోపన్నగారి వసంత్-సరిత ఆధ్వర్యంలో ఆవాహిత దేవతాహోమం, ఔపాసనం, బలిహరణం కార్యక్రమాలను జరిపించారు. ఉదయం వీరభద్రుడి దండకాలు, స్థానిక జంగమయ్యలు చెప్పిన శరభ గద్యాలతో రాజన్న ఆలయం మార్మోగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయ గోశాలవద్ద ఉన్న రెండు రథాలవద్ద ఆలయ స్థానాచార్యులు, అర్చకులు రథ ప్రతిష్ఠ, అగ్నిప్రతిష్ఠ చేశారు. శివుడు, పార్వతీదేవి, శ్రీలక్ష్మీసమేత అనంత పద్మనాభస్వామివార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన రెండు రథాలపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని ఆలయ అధికారులు, అర్చకులు తాళ్లతో ముందుకు లాగారు. రాత్రి 8గంటలకు ఆలయ అద్దాల మండపంలో స్వామివారి వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో హరికిషన్, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
యూట్యూబర్ స్టంట్.. 50 గంటల పాటు సజీవ సమాధి.. వీడియో వైరల్
బైడెన్ ప్రసంగంలో హోలీ ప్రస్తావన