కలెక్టర్ వెంకట్రావు
చక్రాపూర్ సర్పంచ్, కార్యదర్శికి సన్మానం
మహబూబ్నగర్/మూసాపేట, ఏప్రిల్ 2: ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మూసాపేట మండలంలోని చక్రాపూర్ పంచాయతీ జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన సందర్భంగా సర్పంచ్ శైలజ, పంచాయతీ కార్యదర్శి సతీశ్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చక్రాపూర్ గ్రామ పంచాయతీ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరణ్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చూసి ప్రతి గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందకు కృషి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. 1638 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి రూ.8లక్షల నగదు బహుమతి లభించిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 440 గ్రామ పంచాయతీలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ ఆదర్శంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈనెల 24వ తేదీన ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును అందించే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
మొక్కలు నాటడం మనబాధ్యతగా తీసుకోవాలి
మొక్కలు నాటడం వాటిని సంరక్షించడాన్ని ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం వాటర్ డేను పురష్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొక్కలకు నీరు పోశారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు, సిబ్బంది, ప్రజలు వారివారి పరిధిలో మొక్కలకు నీరు పోయాలని సూచించారు.