ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ చేసిన ఓ స్టంట్ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. అతడు ఏకంగా 50 గంటల పాటు సజీవ సమాధి అయ్యాడు. ఓ శవపేటికలో అతన్ని ఉంచి భూమిలో పాతి పెట్టారు. జిమ్మీ డొనాల్డ్సన్ అనే ఈ యూట్యూబర్ తన 5.75 కోట్ల మంది సబ్స్క్రైబర్లను అలరించడానికి ఇలా వింత వింత వీడియోలను చేస్తూనే ఉంటాడు. తాజాగా పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా రెండు రోజుల పాటు సజీవంగా తనను భూమిలో పాతిపెట్టడం విశేషం. దీనికి సంబంధించిన 12 నిమిషాల వీడియోను తన చానెల్లో మిస్టర్ బీస్ట్ పోస్ట్ చేశాడు.
కేవలం నాలుగు రోజుల్లోనే ఈ వీడియోను ఏకంగా 5 కోట్ల మందికిపైగా చూడటం విశేషం. రెండు రోజుల పాటు అతడు ఆ శవపేటికలోనే పడుకొని ఉన్నాడు. తినడానికి కొంత ఆహారంతోపాటు అతని కదలికలను ఎప్పటికప్పుడు రికార్డు చేయడానికి చుట్టూ కెమెరాలు ఏర్పాటు చేశారు. బయటి నుంచి ఆక్సిజన్ను శవపేటికలోకి పంపడంతోపాటు అత్యవసరమైతే చికిత్స అందించడానికి డాక్టర్ను కూడా సిద్ధంగా ఉంచారు.
యూట్యూబ్లో మిస్టర్ బీస్ట్కు ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డు ఉంది. 2017లో నేను లక్ష లెక్క పెట్టాను అని అతడు చేసిన వీడియో వైరల్గా మారింది. ఇక అప్పటి నుంచీ అతడు పోస్ట్ చేసిన ప్రతి వీడియోను 2 కోట్ల మందికిపైగా చూడటం విశేషం. యూట్యూబ్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది.
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
ఆ ఒక్క సిక్స్తోనే వరల్డ్కప్ గెలవలేదు: గంభీర్
టీ20 వరల్డ్కప్.. పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు ఇస్తారా?
డివిలియర్స్ ఆల్టైమ్ ఐపీఎల్ లెవన్ ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?