కావలసిన పదార్థాలు:
మినుములు: 200 గ్రా; బియ్యం: 100 గ్రా; ఎండుమిర్చి: 5, ఇంగువ: చిటికెడు, మిరియాలు: 5, జీలకర్ర: 1 టీస్పూన్, కరివేపాకు: 2 రెబ్బలు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా మినుములు , బియ్యం విడివిడిగా ఆరు గంటలపాటు నానబెట్టాలి. తర్వాత వడగట్టి రెండూ కలిపి ఎండుమిర్చి, మిరియాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, తగినంత ఉప్పు వేసి చిన్నచిన్న ఉండలుగా చేసుకుని తడిగుడ్డ లేదా ప్లాసిక్ పేపర్మీద పలుచగా వత్తుకోవాలి. ఇప్పుడు బంగారు రంగు వచ్చేవరకు నూనెలో వేయించుకుంటే సరి. కరకరలాడే మినుప గారెలు రెడీ. వీటితో పది రోజులపాటు కాలక్షేపం!
ఇవి కూడా చదవండి: