మహబూబ్నగర్ : ఓ వ్యక్తి నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటూ మత్స్యశాఖ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. జిల్లాలోని బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన మత్స్య శాఖ సంఘం అధ్యక్షుడు శివకుమార్.. మత్స్యశాఖ సొసైటీలో 11 మంది కొత్తవారిని చేర్పించేందుకు గాను అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అధికారి వి. గంగారాంను కలిశాడు. ఈ మేరకు సదరు అధికారి వారి పేర్లు నమోదు చేయించేందుకు ఒక్కో సభ్యుడి నుంచి నాలుగు వేల చొప్పున దాదాపు రూ.45 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు రూ.45 వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.