ఆమనగల్లు మార్చి 23: జూన్ చివరినాటికల్లా మాడ్గుల మండలం నాగిళ్ల వరకు సాగుజలాలు పారుతాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమనగల్లు మండల పరిషత్ కార్యా లయం ఆవరణలో ఎంపీపీ అనితతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గుంటకు సాగు నీరు పారాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని ఆయన గుర్తు చేశారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పనుల పై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉమ్మడి పాలమూరు ప్రజాప్రతినిధులు, అధికా రులతో కలిసి సమీక్ష చేసినట్లు ఆయన గుర్తు చేశారు. సమీక్షలో కల్వకుర్తి ఎత్తి పోతల అసంపూర్తి పనులు, నాగిళ్ల వరకు డీ-82 కాల్వల పనుల పురోగతి, నిధులు తదితర విషయాల గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసు కెళ్లిన్నట్లు ఆయన చెప్పారు. దానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పం దించారని కల్వ కుర్తి ప్రాంత రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో కాల్వల పనులను పూర్తి చేసి వానకాలం పంట వరకు సాగు జలాలు పారించేలా చర్యలు తీసుకొంటానని ఆయన ముఖ్యమంత్రి చేప్పారని ఆయన వివరించారు.
గత మూడేళ్లుగా వివిధ కారణాలతో డీ-82 కాల్వ పనులు పూర్తి కాలేదని ఇటివలనే పనుల్లో పురోగతి మొదలైందన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ విడుతల వారిగా నిధులను మంజురూ చేశారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు దాదాపుగా లక్ష ఎకరాలకు సాగు నీరు పారేలా చర్యలు ప్రణాళికలు రూపొందించారన్నారు. ఇప్పటికే కల్వకుర్తి మండలం నుంచి జంగారెడ్డి పల్లి,వెల్దండ, మండలం మీదుగా కాల్వ పనులు ప్రారంభం అయ్యాయన్నారు. ఆమనగల్లు,మాడ్గుల మండలంలో ఎత్తిపోతల పథకం ద్వారా సాగు జలాలు పారుతుండటంతో రైతుల ఎదురుచూపులకు తెరపడనుందని చేప్పారు.
ఉద్యోగుల సంబురాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ
మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు సంబరాలు జరు పుకున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు పీఆర్సీ పెం చడం పట్ల హర్షం ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఎంపీడీవో వెంకట్రాములు స్వీటు తినిపించారు. కార్యక్ర మంలో టీఆర్ఎస్ నాయకులు వస్పుల జంగయ్య, హన్మనాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, మోత్యానాయక్, భాస్కర్రెడ్డి, శివలింగం, కోట శ్రీను, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.