కరోనా వైరస్ మనిషి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా యువతను ‘మినిమలిస్టిక్’ ఆలోచనలవైపు తీసుకెళ్లింది. అన్నిటికన్నా ఆరోగ్యమే ముఖ్యమని గ్రహించేలా చేసింది. బ్యూటీ ఫీల్డ్లో ఇదే కాన్సెప్ట్ను ‘స్కినిమలిజం’ పేరుతో ప్రాచుర్యంలోకి తెస్తున్నారు కాస్మొటిక్ ఫిజీషియన్లు. ‘లెస్ ఈజ్ మోర్’ పద్ధతిలో సౌందర్య చిట్కాలను బోధిస్తున్నారు. ‘మేకప్ పేరుతో చాలామంది చర్మంపై రసాయనాలతో కూడిన క్రీములను రెండు, మూడు లేయర్లుగా పూస్తున్నారు. మచ్చలు కనిపించొద్దనే ఆశతో చర్మాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా చర్మం తనంతటతాను గాయా లను నయం చేసుకునే సహజ శక్తిని కోల్పోతున్నది. కాబట్టి, చర్మానికి అవసరమైన ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వాలి. అంటే మంచి క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ లోషన్ వంటివే వాడాలి. అనవసరమైన మేకప్ సామగ్రిని వదిలించుకోవాలి’ అంటున్నారు డాక్టర్ జమునా పాయ్.