హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో బడులు మూసివేయాలని ప్రభుత్వానికి సూచించామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస రావు తెలిపారు.
అవసమైతే గాంధీ దవాఖానను కరోనా సేవలకే పరిమితం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
కరోనా నిర్ధారణ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించామని చెప్పారు. పరీక్షల సంఖ్యను పెంచి చూపించే ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు.
వైరస్ నియంత్రణకు ప్రజలంతా నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు.