న్యూఢిల్లీ: అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జేమ్స్ ఆస్టిన్ .. ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇవాళ విజ్ఞాన్ భవన్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించాయి. అంతకముందు ఆయన జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళి అర్పించారు. రక్షణ మంత్రి లాయిడ్.. ఇండియాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. శుక్రవారమే ఆయన ప్రధాని మోదీతో పాటు ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్తో భేటీ అయ్యారు. దోవల్తో గత రాత్రి జరిగిన భేటీ అద్భుతంగా సాగినట్లు లాయిడ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య అతిపెద్ద రక్షణ భాగస్వామ్యం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉన్న సవాళ్లను పరిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు.