ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్
రోడ్డు విస్తరణ, బ్రిడ్జి పనులపై నేషనల్ హైవే పీడీతో సమావేశం
మంచిర్యాల, మార్చి 18, నమస్తే తెలంగాణ : రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంబంధిత అధికారులను కోరారు. నేషనల్ హైవే 363 రోడ్డు విస్తరణ, బ్రిడ్జిలకు సంబంధించిన పనుల వివరాలను హైవే పీడీ రవీందర్ రావును అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై గురువారం ఆయనతో విప్ సుమన్ సమావేశం నిర్వహించారు. ఎన్హెచ్ 363 రోడ్డు జిల్లాలోని మంచిర్యాల (ఇందారం), మందమర్రి, బెల్లంపల్లి మీదుగా కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి (మహారాష్ట్ర బార్డర్) నుంచి వెళ్తుండగా, జిల్లాలో ఆయా ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ పనులపై ఆరా తీశారు. మందమర్రితో పాటు పలు ప్రాంతాల్లో నిర్మించిన తలపెట్టిన బ్రిడ్జిల పురోగతి గురించి మాట్లాడారు. పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తతీసుకోవాలని కోరారు.