కంటోన్మెంట్, మార్చి 11 : దేశానికి వన్నె తెచ్చిన మహానీయుడు పీవీ నర్సింహరావు కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణీదేవికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యతగా ఓటేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కోరా రు. గురువారం కార్ఖానాలో ఎమ్మెల్యే సాయన్న మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్మికులు, రైతు లు, ఉద్యోగులు, విద్యావంతుల పొట్టగొడుతున్న బీజేపీ సర్కార్కు ఓట్లడిగే నైతికహక్కు లేదన్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని ఆదరించాల న్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆశించిన దానికంటే సముచితమైన నిర్ణయం తీసుకునేందుకు సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. తెలంగాణలో ఒకప్పుడు పల్లె కన్నీరు పెట్టిందని.. ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తే చాలు.. పట్టభద్రులు తమ ఓటును వాణీదేవికే వేస్తారన్నారు. బీజేపీ చేసే అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. తెలంగాణ ప్రభు త్వం ఉచిత విద్యుత్ను అందిస్తుంటే.. అదే కరెంట్ను ప్రైవేట్పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. పట్టభద్రులు వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
మారేడ్పల్లి, మార్చి 11 : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ సీనియర్ నేత థామస్ జాన్ అన్నారు. గురువారం ఉదయం సికింద్రాబాద్లోని వైఎంసీఎ ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆరేపల్లి రాజేంద్ర, రాబర్ట్ సూర్యప్రకాశ్, స్లీవా గలెలీ, విప్పర్తి, జేమ్స్ సిల్వెస్టర్ సహా పలువురు క్రిస్టియన్ నాయకులు పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతు ప్రకటించారు. విద్యావేత్త అయిన వాణీదేవిని గెలిపించేందుకు క్రిస్టియన్ సమాజం ముందుకు రావడం హర్షణీయమని ఈ సందర్భంగా ప్రముఖ సమాజ సేవకులు ఆరేపల్లి రాజేంద్ర తెలిపారు. సమావేశంలో మూడు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ గ్రాడ్యూయేట్లు పాల్గొన్నారు.
మారేడ్పల్లి, మార్చి 11 : విద్యావంతురాలు, ప్రజా సేవలో నిరంతరం పాటు పడే గొప్ప కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తిగా సురభివాణీదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారని ఆమెను భారీ మేజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులందరిపై ఉందని కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, స్థానిక ఎమ్మెల్యే సాయన్నలు అన్నారు. గురువారం మారేడ్పల్లిలోని చైతన్య జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు పట్టభద్రులకు వివరిస్తూ.. మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి అత్యధిక మేజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం చూసి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు నర్సింహముదిరాజ్, పిట్ల నాగేశ్ ముదిరాజ్, శర్వీన్, దేవులపల్లి శ్రీనివాస్, మురళీయాదవ్, అశోక్ ముదిరాజ్, రామరావు, మల్లేష్, కసిరెడ్డి నరేందర్రెడ్డి పాల్గొన్నారు.