వ్యవసాయ యూనివర్సిటీ/సిటీ బ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు గ్రాడ్యుయేట్లు ఒక మేధావిగా ఆలోచించి ఓటెయ్యాలని హోంమంత్రి మహమూద్అలీ సూచించారు. బుధవారం తెలంగాణ వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం రాష్ట్ర వెటర్నరీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా.కాటం శ్రీధర్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ పీవీ నర్సింహారావు, తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్అలీతో పాటు ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీ దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణను దేశంలోఅగ్రభాగాన నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.అలాంటి ప్రభుత్వానికి పట్టభద్రులు అండగా నిలువాలన్నారు. ప్రతిక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఓటర్లు నమ్మొదని ఆయన సూచించారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యోగులు టీఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. అనంతరం కళాశాల పూర్వ విద్యా ర్థి చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి , ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ పనిచేసే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రత్నం, పట్టభద్రుల, టీఎన్జీఓస్ హైదరాబాద్ అధ్యక్షులు ముజీబ్ హుస్సేన్ పట్టభద్రులనుద్దేశించి మాట్లాడారు.అంతకు ముందు పీవీ నర్సింహారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెటర్నరీ గ్రాడ్యుయేట్ అసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు ప్రసంగించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని కోరుతూ హోం మంత్రి మహమూద్అలీ బుధవారం పబ్లిక్ గార్డెన్లో వాకర్స్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. పట్టభద్ర ఓటర్లు తాము వేయడమే కాకుండా తోటి వారితో కూడా ఓటు వేయించాలని విజ్ఞప్తి చేశారు.మంత్రితో పాటు టీఆర్ఎస్ నాయకులు బండి రమేశ్, సీ.హెచ్. ఆనంద్కుమార్గౌడ్, అబ్దుల్ బాసిత్ తదితరులు పాల్గొన్నారు.
రవీంద్రభారతి,మార్చి 10: నాన్నగారు పీవీ నరసింహారావు స్ఫూర్తి తో రాజకీయాల్లోకి వచ్చానని, తాను ఇదే జేఎన్టీయూలో చదివి, ఇదే కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసి ఎంతో మంది విద్యార్థులను గొప్పవ్యక్తులుగా తీర్చిదిద్దానని ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవీ తెలిపారు. మాసబ్ట్యాంక్లోని జేఎన్టీయూలో జరిగిన ఉద్యోగ సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో సురభివాణీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలను, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం పనిచేస్తానన్నారు. పట్టభద్రుల్లు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాకేశ్, పలువురు విద్యా వేత్తలు, ప్రొఫెసర్లు,లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.