ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సూచీ సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 51,325 వద్ద ట్రేడవుతున్నది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 90 పాయింట్ల లాభంతో 15,188 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాలతో ముగియడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం విదేశీ మదుపరులు పెట్టుబడులకు మొగ్గుచూపడంతో దేశంలోని ఐటీ, మెటల్, బ్యాంకింగ్ సెక్టార్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. అదేవిధంగా ఎనర్జీ, ఆటోమొబైల్, ఫైనాన్సియల్ రంగాలు కూడా లాభాల బాటలోనే ఉన్నాయి.