జిల్లావ్యాప్తంగా బోదకాలు, నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ ప్రారంభం
పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పిలుపు
దుబ్బాక టౌన్/ మిరుదొడ్డి/ తొగుట/ రాయపోల్, జూలై 15 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరి చేరవని మున్సిపల్ చైర్పర్సన్ వనితాభూంరెడ్డి అన్నారు. మున్సిపల్లో ఫైలేరియా నివారణ మందులను తిమ్మాపూర్ వైద్యసిబ్బందితో కలిసి ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్ యాదమ్మ, వైద్యురాలు భార్గవి ఉన్నారు. 2వ వార్డులో కౌన్సిలర్ దేవలక్ష్మీసంజీవరెడ్డి, 13వ వార్డులో ఆస సులోచన స్వామి, 14వ వార్డులో ఆస యాదగిరి, 16వ వార్డులో కౌన్సిలర్ దేవుని లలిత మాత్రలను పంపిణీ చేశారు.
ప్రజలందరూ అల్బెండజోల్, డీఈసీ మాత్రలు వేసుకోవాలని ఎంపీపీ సాయిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, డాక్టర్ మల్లికార్జున్, సీనియర్ నేత సూకురి లింగం సూచించారు. మిరుదొడ్డిలో జరిగిన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, ఉప సర్పంచ్ కనుకయ్య, సీహెచ్వో లింగమూర్తి పాల్గొన్నారు. తొగుట పీహెచ్సీలో ఎంపీపీ లతానరేందర్రెడ్డి, డాక్టర్ వెంకటేశ్, కాన్గల్లో వైస్ ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, రాయపోల్లో ఎంపీపీ అనితాశ్రీనివాస్, పీహెచ్సీ వైద్యాధికారి శ్రీధర్, పెద్దఆరెపల్లిలో సర్పంచ్ కొంపల్లి కరుణాకర్తో కలిసి ఇంటింటికీ తిరిగి మందులు పంపిణీ చేశారు.
పైలేరియాను నివారిద్దాం : మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
గజ్వేల్, జూలై 15 : మున్సిపాలిటీలో బోదకాల వ్యాధిని నివారణకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కోరారు. 18వ వార్డులో మున్సిపల్ చైర్మన్, 15వ వార్డులో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, 2వ వార్డులో బాలమణి, 16వ వార్డులో భాగ్యలక్ష్మీదుర్గాప్రసాద్, 2వ వార్డులో కౌన్సిలర్ బాలమణీశ్రీనివాస్రెడ్డి, వర్గల్లో వైద్యురాలు హ రిత, ఎంపీహెచ్ ఈవో రాజేశ్వర్, సూపర్వైజర్లు శ్రీనివాస్, ఉమారాణి, నాగరాజు, ప్రభాకర్, ఏఎన్ఎం శ్రీలత, ఆశ వర్కర్ కవిత మందులు పంపిణీ చేశారు.
ప్రతిఒక్కరూ మాత్రలు వేసుకోవాలి
నంగునూరు/సిద్దిపేట కమాన్, జూలై 15 : బోదవ్యాధి నివారణ మాత్రలు వేసుకోవాలని ఎన్సీడీ ప్రోగ్రామ్ జిల్లా అధికారి డాక్టర్ రాధిక సూచించారు. నర్మెటలో మార్కెట్ కమిటీ చైర్మన్ సారయ్య, మాజీ ఎంపీపీ శ్రీకాంత్రెడ్డితో కలిసి బోదకాల వ్యాధి నివారణ మాత్రలు అందజేశారు. కార్యక్రమాల్లో రాజగోపాల్పేట పీహెచ్సీ ఇన్చార్జి వైద్యాధికారి డా.నవ్యశ్రీ, పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ మహిపాల్రెడ్డి, హెచ్ఈవో సతీష్, సూపర్వైజర్ కమల, ఏఎన్ఎం పద్మ, హెల్త్ అసిస్టెంట్లు లింగం, మహేందర్, కార్యదర్శి వినయ్ ఉన్నారు. సిద్దిపేటలోని 16వ వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ మల్లికార్జున్ మాత్రలను అందజేశారు.
శుభ్రత పాటించాలి : చైర్పర్సన్ రజితావెంకన్న
హుస్నాబాద్టౌన్/అక్కన్నపేట/కోహెడ/బెజ్జంకి, జూలై 15 : పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకన్న అన్నారు. 15వ వార్డులో మున్సిపల్ వైస్చైర్పర్సన్ అనిత, మాజీ ఎంపీపీ వెంకట్, కౌన్సిలర్లు నళినిదేవి, వేణు, ఏఎన్ఎం ఇందిర మాత్రలు అందజేశారు. అక్కన్నపేట ప్రభుత్వ దవాఖానలో మాత్రల పంపిణీని జడ్పీటీసీ భూక్య మంగ, ఎంపీపీ లక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్రావు, సర్పంచ్ సంజీవరెడ్డి, ఎంపీడీవో సత్యపాల్రెడ్డి, ఎస్సై రవి, ఎంపీటీసీ సాంబరాజు, డాక్టర్ లావణ్య, డివిజన్ అధికారి రామ్మూర్తి, మాజీ జడ్పీటీసీ బీలునాయక్, హెచ్ఈవో శ్రీనివాస్వీనిత్ పాల్గొన్నారు. కోహెడ మండలం బస్వాపూర్ లో ఎంపీపీ కొక్కుల కీర్తి, శనిగరంలో జడ్పీటీసీ నాగరాజుశ్యామల మాత్రల పంపిణీ ప్రారంభించారు. వారి వెంట సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య, కర్ర జయశ్రీ పాల్గొన్నారు.
బెజ్జంకి మండలంలోని తోటపల్లి పీహెచ్సీలో మాత్రల పంపిణీని జడ్పీటీసీ కవితతో కలిసి ఎంపీపీ నిర్మల ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొయినిపల్లి నర్సింగరావు, ఎంపీటీసీ లక్ష్మి, వైద్యుడు లింగారెడ్డి పాల్గొన్నారు.
ప్రజారోగ్యమే లక్ష్యం : చైర్పర్సన్ స్వరూపరాణి
చేర్యాల/ధూళిమిట్ట/మద్దూరు/కొమురవెల్లి, జూలై 15 : చేర్యాల సీహెచ్సీతోపాటు 1వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపరాణి మాత్రలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ అల్బెండజోల్, డీఈసీ మాత్రలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు అంకుగారి శ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ నేత బూరగోని తిరుపతిగౌడ్ పాల్గొన్నారు.
ధూళిమిట్ట మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి మాత్రలు పంపిణీ చేశారు. మద్దూరు, లద్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు డాక్టర్ రాజు, డాక్టర్ సుధారాణి ప్రజలకు మాత్రలు పంపిణీ చేశారు. మద్దూరు పీహెచ్సీ పరిధిలో 5790 మందికి డీఈసీ, అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వంగ భాస్కర్రెడ్డి, వైద్యుడు సలీం పాల్గొన్నారు. కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట, రసూలాబాద్లో సర్పంచ్లు కరుణాకర్, స్వామిగౌడ్ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమం లో ఎంపీవో వీరరాజు, ఎంపీటీసీ దుర్గారెడ్డి పాల్గొన్నారు.