ములుగు, జూలై 15 : మార్కెట్ కమిటీకి వచ్చే రైతులకు ‘సద్దిమూట’ పేరుతో రూ. 5కే భోజన వసతి కల్పిస్తున్నామని ఏఎంసీ చైర్మన్ జహంగీర్ తెలిపారు. ములుగు మండల పరిధిలోని వంటిమామిడి మార్కెట్ యార్డులో ‘హరే రామ హరే కృష్ణ’ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ‘సద్దిమూట’ 5 రూపాయలకే భోజనం కార్యక్రమాన్ని గురువారం ఏఎంసీ వైస్ చైర్మన్ పూడూరి భూపాల్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుక్కల నరేశ్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ జహంగీర్ మాట్లాడుతూ రైతుల సౌలభ్యం కోసం అనేక సౌకర్యాలను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రైతులందరూ తమ కూరగాయలను విక్రయించిన వెంటనే విధిగా తక్పట్టిని తీసుకెళ్లాలని సూచించారు. కమీషన్ ఏజెంట్లు మార్కెట్ నియమాలను ఉల్లంఘించొద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీటీల ఫోరం మండలాధ్యక్షుడు దుంబాల లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కుక్కల బాబుగౌడ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సందుగారి నర్సింహారెడ్డి, కార్యదర్శి రేవంత్, పాలకవర్గ సభ్యులు బాపురెడ్డి, కృష్ణమూర్తి, బాలయ్య, తిరుపతి, మల్లారెడ్డి పాల్గొన్నారు.