చెన్నై : తమిళనాడులో కుప్పకూలిన డిఫెన్స్ హెలికాఫ్టర్ ఘటనపై కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. హెలికాఫ్టర్ ప్రమాదం గురించి ప్రధాని నరేంద్ర మోదీకి రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ వివరించారు. ఈ ప్రమాదంపై ప్రధాని ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదంపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రకటన చేయనున్నారు.
కాగా తమిళనాడులో డిఫెన్స్ హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో నలుగురు మరణించారని నీలగిరి జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ హెలికాఫ్టర్లో సీడీఎస్ బిపిన్ రావత్తో పాటు 14 మంది ప్రయాణిస్తున్నారని సమాచారం.ఆర్మీ హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం తమిళనాడులోని కోయంబత్తూరు – కూనూరు మధ్య కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది.
చెన్నై : తమిళనాడులో కుప్పకూలిన డిఫెన్స్ హెలికాఫ్టర్ ఘటనపై కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. హెలికాఫ్టర్ ప్రమాదం గురించి ప్రధాని నరేంద్ర మోదీకి రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ వివరించారు. ఈ ప్రమాదంపై ప్రధాని ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదంపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ ప్రకటన చేయనున్నారు.