సిద్దిపేట, జూలై 14 : సిద్దిపేట జిల్లాలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు త్వరలోఅందుబాటులోకి రానున్నాయి. ప్లాంట్కు సంబంధించిన పరికరాలు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖాకు చేరాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషితో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ కు సంబందించిన పనులన్నీ వారం రోజుల్లో పూర్తి కానున్నాయి. దీంతో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి రానుంది. కరోనా మహమ్మారి విలయ తాండవం చేయడంతో ఆక్సిజన్ అందక అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జిల్లాలో భవిష్యత్ అవసరాల కోసం సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంతోపాటు త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేలా మంత్రి హరీశ్రావు కృషి చేశారు. వీటితో పాటు సంగారెడ్డి, మెదక్, జోగిపేట పట్టణాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను మంజూరు చేయించారు. సిద్దిపేటలో ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో స్థలం గుర్తించారు. మంగళవారం సిద్దిపేటకు ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన పరికరాలు రావడంతో మరో వారం రోజు ల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసే ఆక్సిజన్ ప్లాంట్ గంటకు 20వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయనుంది. మెదక్, సంగారెడ్డిలో గంటకు 10వేల లీటర్లు, గజ్వేల్, దుబ్బాక, జోగిపేటలో గంటకు 5వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామ ర్థ్యం ఉన్న కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.