దుబ్బాక, జూలై14 : దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిలర్లు తిరిగి సొంత (టీఆర్ఎస్) గూటికీ చేరుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే తమ తప్పు తెలుసుకుని, కప్పుకున్న కాషాయ కండువాలను విసిరేసి.. గర్వంగా గులాబీ గూటికి చేరుకున్నా రు. దుబ్బాకలో కమలనాథులు చేస్తున్న చిల్లర రాజకీయ ఎత్తు గడలు అపహాస్యంగా మారుతున్నాయి. గూలాబీ ప్రజాప్రతినిధులకు ఎర వేసి.. కాషాయంలోకి లాగడానికి చేస్తున్న కమ లానాథుల ప్రయత్నాలు బెడిసికొట్టడంతో బొక్కబోర్లా పడు తున్నారు. ఇకపై గులాబీ శ్రేణులను ముట్టుకుంటే ముళ్లు కు చ్చుకుంటాయని బీజేపీ నాయకులకు కనువిప్పు కలిగించింది.
దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో స్వల్ప మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే.. తమ పార్టీ అధిష్టానం మెపు్పు కోసం చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు బెడిసి కొడుతుండడంతో అయోమయంతో తల పట్టుకుంటున్నారు. దుబ్బాకలో నిన్న టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇద్దరు బీజేపీలో చేర్పించడానికి వారిని బలవంతంగా హైదరాబాద్కు తీసుకెళ్లారు. కొన్ని గంటల వ్యవధిలోనే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు తమ తప్పును తెలుసుకుని సొంత పార్టీకి చేరుకున్నారు. దీంతో కమలనాథులు చేసిన ప్రయత్నాలు బుడిదలో పోసిన పన్నీరుగా మారింది. అంతేగాక దుబ్బాకలో బీజేపీ నాయకుల మాటలకు విలువ లేకుండా పోయిందని చెప్పకనే చెపవ్పచ్చు.దుబ్బాక మున్సిపల్ చెందిన దివిటి కనకయ్య(7వ వార్డు), దుబ్బాక బాలకృష్ణ (8వ వార్డు) మంగళవారం బీజేపీలో చేరారు. కొద్ది గంటల వ్యవధిలో బుధవారం ఉదయం హైద రాబాద్లో మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డి సమక్షం లో టీఆర్ఎస్లో చేరారు. తప్పు తెలుసుకుని రావడంతో మం త్రి, ఎంపీలు పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నేత కొత్త కిషన్రెడ్డి ఉన్నారు.