వాషింగ్టన్: కరోనా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ఆన్లైన్కు మారాయి. ఈ కష్టకాలంలో చాలా దేశాలు ఈ ఆన్లైన్ క్లాస్ల కోసం జూమ్( Zoom ) అనే వీడియో కాన్ఫరెన్సింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్పై ఆధారపడ్డాయి. అయితే ఇప్పుడీ జూమ్కు కనెక్ట్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ క్లాసులు, వీడియో కాల్స్, వెబినార్లపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇంటర్నెట్లో ఔటేజ్లను ట్రాక్ చేసే వెబ్సైట్ డౌన్డిటెక్టర్ ప్రకారం.. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఈ జూమ్ నెట్వర్క్ అసలు పని చేయలేదు.
అయితే వెంటనే స్పందించిన జూమ్.. ఆస్ట్రేలియాలో చాలా వరకూ ఈ సమస్యను పరిష్కరించగలిగింది. కానీ ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలా మంది జూమ్కు కనెక్ట్ కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై పని చేస్తున్నామని, అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నామని జూమ్ ట్విటర్లో చెప్పింది. ఇండియాలో ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మీటింగ్ స్టార్టయినా కూడా చాలా మంది వెయిటింగ్ ఫర్ ద హోస్ట్ టు స్టార్ట్ ద మీటింగ్ అనే మెసేజ్ వస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.