జూలూరుపాడు, జూన్ 4 : పేదల పాలిట ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్అని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు. మండలంలోని కాకర్ల, పాపకొల్లు, బేతాళపాడు గ్రామాల్లో శుక్రవారం పర్యటించి పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అందులోని ఆక్సిజన్ కన్సన్ట్రేటర్ పరికరాన్ని, ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అమర్చిన పైపులైన్ను పరిశీలించారు. ప్రభుత్వ వైద్యుల సేవలను అభినందించారు. అనంతరం పడమటనర్సాపురం గ్రామం చేరుకొని అక్కడ 50 బెడ్లతో ఏర్పాటుచేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. తరువాత సహకార సంఘం కార్యాలయంలో రైతులకు పచ్చరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీపీ సోనీ, జడ్పీటీసీ కళావతి, డిప్యూటీ డీఎంహెచ్వో పోటు వినోద్, ప్రభుత్వ వైద్యుడు వీరబాబు, ఆర్ఐ వీరభద్రం, ఎంపీవో రామారావు, సీఈవో రమణారెడ్డి, సర్పంచ్లు కట్రం మోహన్రావు, రమాదేవి, లక్ష్మి, ఎంపీటీసీలు దుద్దుకూరి మధుసూదన్రావు, పొన్నెకంటి సతీశ్కుమార్, పెండేల రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు నున్నా రంగారావు, నర్వినేని పుల్లారావు, శ్రీనాథరాజు నాగరాజు, యల్లంకి పుల్లయ్య, ఖాజా రమేశ్, గుగులోత్ రాంబాబు పాల్గొన్నారు.