ప్రస్తుతం స్మార్ట్ఫోన్లదే రాజ్యం. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్లే. తిన్నా.. తినకున్నా.. నిద్రపోయినా.. పోకున్నా.. స్మార్ట్ఫోన్ మాత్రం ఎప్పుడూ చేతుల్లో ఉండాల్సిందే. లేకపోతే రోజు గడవదు. ప్రతి ఒక్కరు రెండు మూడు స్మార్ట్ ఫోన్లను కొంటున్నారు. దీంతో స్మార్ట్ఫోన్లకు తెగ గిరాకీ పెరుగుతోంది. అందుకే హాట్ కేకుల్లా ఫోన్లు అమ్ముడుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా డిమాండ్ ఉన్న బ్రాండ్లలో సామ్సంగ్, యాపిల్, జియోమీ, ఒప్పో, రియల్మీ, వివో లాంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి.
అయితే.. ఓవర్ ఆల్గా టాప్లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ ప్లేస్లో సామ్సంగ్ ఉంది. కానీ.. జూన్ 2021 లో మాత్రం ఫోన్ల సేల్స్లో సామ్సంగ్ను దాటేసి జియోమీ మొదటిస్థానంలో నిలిచిందట. కౌంటర్పాయింట్ అనే మార్కెట్ రీసెర్చ్ కంపెనీ చేసిన సర్వేలో వెల్లడైన విషయాలు ఇవి.
మొత్తంగా.. సెకండ్ క్వార్టర్ను తీసుకుంటే మాత్రం జియోమీ.. సామ్సంగ్ వెనుకే ఉంది. జూన్ 2021లో ప్రపంచవ్యాప్తంగా జియోమీ మార్కెట్ షేర్ తీసుకుంటే.. 17.1 శాతం ఉండగా.. 15.7 శాతంతో సామ్సంగ్ రెండో ప్లేస్లో ఉంది. యాపిల్ 14.3 శాతంతో మూడో ప్లేస్లో ఉంది. జూన్ నెలలో యూరప్, చైనా, ఇండియాలో జియోమీ సేల్స్ విపరీతంగా జరిగాయట. అందుకే.. జియోమీ.. సామ్సంగ్ను వెనక్కి నెట్టేసి మొదటి స్థానంలో నిలిచిందని జియోమీ కంపెనీ వెల్లడించింది.