RedmiBook Pro : రెడ్మీ ఫోన్లతో సంచలనం సృష్టించిన జియోమీ.. తాజాగా రెడ్మీబుక్ పేరుతో లాప్ టాప్లను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్మీ బుక్ ప్రో, రెడ్మీ బుక్ ఈ-లెర్నింగ్ ఎడిషన్ను లాంచ్ చేసింది. రెండు మోడల్స్ కూడా లెవెన్త్ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్ను కలిగి ఉన్నాయి. 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ హార్డ్ డిస్క్తో మార్కెట్లోకి తీసుకొచ్చారు. రెడ్మీబుక్ ప్రో లాప్ టాప్.. ప్రొఫెషనల్స్ కోసం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. అలాగే.. రెడ్మీబుక్ ఈ-లెర్నింగ్ ఎడిషన్ లాప్ టాప్.. రిమోట్లో ఉండి.. ఆన్ లైన్ క్లాసులు వినే స్టూడెంట్స్ కోసం డిజైన్ చేశారు.
ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 10 గంటల బ్యాటరీ బ్యాకప్తో పాటు.. విండోస్ 10 హోమ్ ఎడిషన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ స్టూడెంట్ ఎడిషన్ 2019 ఈ మోడల్స్లో ఉన్న ఫీచర్లు. విండోస్ 10 నుంచి విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్కు ఉచితంగా అప్ గ్రేడ్ చేసుకునే సదుపాయం కూడా ఈ లాప్ టాప్స్లో ఉంది.
రెడ్మీబుక్ ప్రో లాప్ టాప్ ధరను ఇండియాలో 49,999 రూపాయలు. ఈ లాప్ టాప్లో 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ హార్డ్ డిస్క్ లాంటి ఫీచర్లు ఉంటాయి.
రెడ్మీబుక్ ఈ-లెర్నింగ్ ఎడిషన్ ధర 41,999 రూపాయలు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ హార్డ్ డిస్క్ లాంటి ఫీచర్స్కు మాత్రమే ఈ ధర. ఒకవేళ 8 జీబీ ర్యామ్తో పటు 512 జీబీ హార్డ్ డిస్క్ కావాలంటే మాత్రం 44,999 రూపాయలు చెల్లించాలి. ఈ రెండు మోడల్స్ ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్లో అందుబాటులో ఉంటాయి.