హైదరాబాద్, జూన్ 15: అత్యాధునిక టెక్నాలజీతో న్యూ ఫీచర్స్ తో స్మార్ట్ఫోన్లనుతయారు చేస్తున్నస్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ సరికొత్త స్మార్ట్వాచ్ను రూపొందించింది. ‘ఎమ్ ఐ వాచ్ రివాల్వ్ యాక్టివ్ ‘ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్దమైంది. దీనిని జూన్ 22న విడుదల చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది. అదే రోజు భారత్లో ఎంఐ 11 లైట్ స్మార్ట్ ఫోన్ కూడా విడుదల కానుంది.
ఎంఐ 11 లైట్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉండనుండగా, వాచ్ మాత్రం అమెజాన్, ఎంఐ.కాంలల్లో అందుబాటులోకి రానున్నది. అయితే గత సంవత్సరం మన దేశంలో విడుదలైన ఎంఐ వాచ్ రివాల్వ్కి తర్వాతి వెర్షన్గా ఈ వాచ్ మార్కెట్లో తీసుకురానున్నది. దీని ధర భారత్లో రూ.10,999గా ఉంది. ఇందులో ఎస్పీఓ2 మానిటరింగ్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. హార్ట్ రేట్ మానిటర్, బిల్ట్-ఇన్ జీపీఎస్, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్మార్ట్ నోటిఫికేషన్ వంటి ఫీచర్లను ఎంఐ ఇందులో అందింస్తున్నది.